by సూర్య | Mon, Jan 18, 2021, 05:34 PM
పోలీసులపై ఎంపీ జీవియల్ ఫైర్..రాష్ట్రంలో ఆలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవియల్ నరసింహారావు పోలీసులపై మండిపడ్డారు. గుంటూరు సిటీ, పశ్చిమ నియోజకవర్గంలోని లాల్ పురం లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసులు చిత్త శుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా ఆలయాలపై దాడులు చేసిన నిజమైన ముద్దాయిలను అరెస్ట్ చేయాలని పోలీసులకు హితవు పలికారు.
Latest News