by సూర్య | Tue, Jan 19, 2021, 08:08 AM
హైదరాబాద్ : తిరుపతిలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జరిగిన శాసనసభా కమిటీ సమావేశంలో సోమవారం ఆమె కంటతడి పెట్టారు. రోజా పేర్కొన్న కొన్ని అంశాలు కమిటీ పరిధిలోకి రావని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శాసనసభా హక్కుల కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. భవిష్యత్లో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించినట్లు కాకాణి తెలిపారు.
Latest News