by సూర్య | Mon, Jan 18, 2021, 02:22 PM
కిరాయి గూండాలతో కన్న కూతుర్ని హత్య చేయించేందుకు తల్లి స్కెచ్ వేసింది. రూ.50వేలు సుపారీ కూడా ఇచ్చింది. అయితే స్కెచ్ బెడిసి కొట్టడంతో అసలు గుట్టు రట్టైంది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం సుకిరి గిరి అనే 58 ఏళ్ల మహిళ తన కుమార్తె షిబానీ నాయక్ తో కలిసి ఉండేది. అయితే షిబానీ నాయక్ కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తుండేది. అయితే అది ప్రమాదం అని వద్దని తల్లి వారించింది. ఎన్నిసార్లు హెచ్చరించినా కుమార్తె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
దీంతో కుమార్తెను చంపాలని తల్లి సుకిరిగిరి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా హత్యకు సంబంధించి ఒక గ్యాంగ్ ను సంప్రదించింది. ప్రమోద్ జీనా, మరో ఇద్దరితో రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. తొలుత అడ్వాన్సుగా రూ.8వేలు చెల్లించింది. దీంతో ఈ నెల 12న షిబానీ నాయక్ను రాళ్లతో మోది హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్రామ్ గ్రామంలోని వంతెన కింద లభించడంతో..పోలీసులు విచారణ చేపట్టారు. తల్లి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు ఆరా తీశారు. తల్లి అసలు విషయం చెప్పింది. తల్లితోపాటు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.