by సూర్య | Mon, Jan 18, 2021, 02:16 PM
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన గుంటూరు జిల్లాలోని యడ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఎస్.సుందర్ రాజన్ తెలిపిన వివరాల ప్రకారం యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత (28) అనే మహిళకు కొంత కాలం క్రితం కానీషా అనే వ్యక్తితో వివాహమైంది. సునీతకు అదే ప్రాంతానికి చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తితో వివాహేతర బంధం ఏర్పడింది.
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు మందలించారు. తమ బంధానికి కుటుంబ సభ్యులు అడ్డొస్తున్నారని భావించిన వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాకుమాను శివారులోకి వెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని వేణుగోపాల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి సునీత మృతి చెందగా వేణుగోపాల్ అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. వేణుగోపాల్ను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చస్తున్నారు.