మతాన్ని రాజకీయానికి ముడిపెడుతున్నారు: శైలజానాథ్

by సూర్య | Mon, Jan 18, 2021, 01:58 PM

మతాన్ని రాజకీయానికి ముడిపెట్టి మాట్లాడే నాయకుల వల్లే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న వారిని ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేకపోతుందో చెప్పాలన్నారు. దేవాలయాలపై దాడుల కారణంగా ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆకలిని అడ్డుపెట్టుకొని భాజపా వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీతో చంద్రబాబు, జగన్ కుమ్మక్కై.. రైతులకు ద్రోహం చేస్తున్నారని ఆక్షేపించారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈ నెల 19న గవర్నర్​ను కలవనున్నట్లు వెల్లడించారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM