బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

by సూర్య | Sun, Jan 17, 2021, 03:30 PM

పుదుచ్చేరి బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆ పార్టీ ఎమ్మెల్యే, ట్రెజరర్ కేజీ శంకర్ (71) ఆదివారం ఉదయం కన్నుమూసారు. పుదుచ్చేరికి చెందిన ఎమ్మెల్యే శంకర్.. ఇలాంగోనగర్‌లోని తన నివాసంలో ఉదయం నిద్రలేవగానే ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. కేజీ శంకర్‌కు భార్య, ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. 1950లో పుదుచ్చేరిలో జన్మించిన శంకర్‌.. 1984 నుంచి ఇప్పటివరకు బీజేపీ నాయకుడిగా కొనసాగారు. శంకర్ మృతిపట్ల పుదుచ్చేరికి చెందిన రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM