by సూర్య | Sun, Jan 17, 2021, 12:12 PM
దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రాస్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఆందోళన కర స్థాయిలో ఉంది. తాజాగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలలో భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడ్డాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా దాదాపు వెయ్యి పక్షలు మరణించాయి. లాతూర్లో 253, యవత్మాల్లో 205, అహ్మద్ నగర్ 151, వార్ధా 109, నాగ్పూర్ 45, గోందియాలో 23 ఫౌల్ట్రీ పక్షులు మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వాటి నమూనాలను డీఐఎస్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపారు. ఈ నెలలో ఇంత వరకూ మొత్తం 5,151 పక్షులు మృతి చెందాయని అధికారులు తెలిపారు.
Latest News