by సూర్య | Sun, Jan 17, 2021, 11:47 AM
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన దురదృష్టకరమన్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా.. అనువంశిక చైర్మన్ పదవి నుంచి తొలగించడం అన్యాయమన్నారు. చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు లేవన్నారు. అంతర్వేది, దుర్గగుడి ఘటనలో చైర్మన్, ఈవోలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. కొత్త విగ్రహాల ఏర్పాటు కోసండొనేషన్ ఇచ్చా.. ఇచ్చిన విరాళాలను వెనక్కి ఇవ్వడం సరికాదని అశోక్గజపతిరాజు పేర్కొన్నారు.
Latest News