by సూర్య | Sat, Jan 16, 2021, 01:27 PM
భారత్, ఆస్ట్రేలియాతో మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట రెండు సెషన్లే జరిగింది. టీ విరామం అనంతరం వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది. మళ్ళీ తిరిగి ప్రారంభం కాలేదు. అప్పటికీ 2 వికెట్లు కోల్పోయిన భారత్ 26 ఓవర్లలో 62 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్(7), రోహిత్(44) అవుట్ అయ్యారు. ప్రస్తుతం పుజారా (8*), రహానె(2*) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా కన్నా భారత్ ఇంకా 307 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ మంచి స్కోర్ సాధించాలంటే పుజారా, రహానె బాగా ఆడాల్సి ఉంది. ఇప్పుడు భారమంతా వారిద్దరిపైనే ఉంది.
Latest News