by సూర్య | Sat, Jan 16, 2021, 02:02 PM
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని భావన రుషి గుడి సమీపంలో మద్యం మత్తులో భార్యను ఓ భర్త కత్తితో పొడిచాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భావనారుషి గుడి దగ్గర గోపినాథ్, జ్యోతి దంపతులు నివాసముంటున్నారు. గోపినాథ్ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడి ఆమెను కత్తితో పొడిచాడు. దీంతో జ్యోతికి (24) తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జ్యోతిని గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు.
Latest News