by సూర్య | Fri, Jan 15, 2021, 04:44 PM
తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 21న తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీ జరగనుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.
Latest News