by సూర్య | Fri, Jan 15, 2021, 04:13 PM
అమెరికాలోని న్యూయార్క్ లో దారుణం జరిగింది. భూపిందర్ సింగ్(57) అనే భారత సంతతి వ్యక్తి తన కూతుర్ని, అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి 9.30 గంటలకు అతడు తన కూతురు జస్లీన్ కౌర్(14), అత్త మంజీత్ కౌర్ ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో 40 ఏళ్ల మహిళ రాష్ పాల్ కౌర్ కూడా గాయపడింది. భయంతో ఆమె బయటకు పారిపోయి పొరుగింటి వారిని సహాయం కోరింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భూపిందర్ సింగ్, ఆయన కుమార్తె, అత్త కాల్పుల గాయాలతో చనిపోయినట్లు గుర్తించారు. కాల్పుల్లో గాయడిన రాష్పాల్ కౌర్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Latest News