by సూర్య | Fri, Jan 15, 2021, 12:18 PM
గోపూజ మహోత్సవంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జిల్లా నరసరావుపేటకు చేరుకున్నారు. ఇస్కాన్ సహకారంతో 108 గోవులకు నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో కామధేను పూజను నిర్వహించనున్నారు. టిటిడి ఆధ్వర్యంలో గంటపాటు కామధేను పూజ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాస్లు ఉన్నవారినే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:10 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
Latest News