by సూర్య | Fri, Jan 15, 2021, 12:45 PM
గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం తగదని ,దిగజారుడు రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, టిడిపి శాసనసభ పక్ష ఉపనేత, కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ పక్ష ఉపనేత, కింజరాపు అచ్చెన్నాయుడు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు .
గోవును కోటి దేవతలకు ప్రతిరూపంగా ప్రజలు భావిస్తారని, గోవును అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యని,ఆయన దుర్మార్గానికి ఇది నిదర్శనమని, సరైన పోషణ లేక ఎన్నో గోవులు మృత్యువాత పడ్డాయని, దానిపై స్పందించని ముఖ్యమంత్రి నేడు గుడికో గోమాత అంటూ విలక్షణ నటనకు తెరతీశారని,. ఇడుపులపాయలో క్రూర మృగాలను పెంచుతూ గుడికో గోమాత కార్యక్రమం చేపట్టడం విడ్డూరం. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆర్హత ముఖ్యమంత్రికి లేదని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు.