by సూర్య | Wed, Jan 13, 2021, 01:38 PM
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. తుపాకీని కాల్చడం నేర్పిస్తానని భార్యను పొట్టనబెట్టుకున్నాడో భర్త. ఈ సంఘటన కర్ణాటక తుముకూరు జిల్లాలోని డి.కొరటిగెరెలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. శారద, కృష్ణప్ప దంపతులు. సోమవారం రాత్రి 9:30 సమయంలో ఆమె భర్త కృష్ణప్ప (35) తన స్నేహితుని వద్దనున్న నాటు తుపాకీని తీసుకొచ్చాడు. దీనిని ఎలా కాల్చాలో చూపిస్తానన్నాడు. కాల్చడం నేర్పిస్తున్న సమయంలో ఏం జరిగిందో కానీ తూటా పాయింట్ బ్లాంక్లో నేరుగా ఆమె తలలోకి దూసుకుపోయింది. బుల్లెట్ దూసుకుపోవడంతో శారద అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తెల్లవారుజామున 2 గంటలకు హెబ్బూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని కృష్ణప్పను అరెస్టు చేశారు. అయితే శారదను కావాలనే హత్య చేశాడా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు.
Latest News