నట్టేట ముంచిన మహిళ.. ఆ భయంతో కుటుంబం ఆత్మహత్య

by సూర్య | Wed, Jan 13, 2021, 01:19 PM

పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. నమ్మిన మహిళ మోసం చేయడంతో ఏం చేయాలో తోచక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన జిల్లాలోని కుముదపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనమల కుదురుకు చెందిన పరశురాం అనే వ్యక్తి అధిక వడ్డీకి ఆశపడి రూ.46 లక్షలు అప్పుగా తెచ్చి హైమతి అనే మహిళకు ఇచ్చాడు. ఆ మహిళ డబ్బుతో పరారవ్వడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చనిపోయే ముందు బంధువులకు వాట్సాప్‌ మెసేజ్‌లు పెట్టడంతో వారంతా అక్కడికి చేసుకునేసరికే ముగ్గురూ విగత జీవులై కనిపించారు. చోడిశెట్టి హైమ అధిక వడ్డీ ఆశ చూపి చాలామంది నుంచి రూ.కోటికి పైగా వసూలు చేసినట్టు సమాచారం. ఏలూరుకు చెందిన కానిస్టేబుల్‌ ఉచ్చులోపడిన హైమ.. అతడి సూచన మేరకు ఐపీ పెట్టి ఊరినుంచి వెళ్లిపోయినట్టు చెప్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM