నాలుగో టెస్టులో బరిలోకి దిగేదెవరు?

by సూర్య | Wed, Jan 13, 2021, 01:01 PM

వరుసగా ఆటగాళ్లకు గాయాలు అవుతుండటం టీమిండియాను కలవరపెడుతోంది. ఆసీస్ తో జరిగే నాలుగో టెస్టుకు ఎవరెవరు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. సీనియర్ బౌలర్లలందరికీ గాయాలు అవడంతో.. ఈ సిరీస్ లోనే ఆరంగేట్రం చేసిన ఆడిన సిరాజ్ పై టీమిండియా ఆధారపడనుంది. బ్యాటింగ్ విషయంలో మారీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ.. ప్రధాన బౌలర్లు లేకుండా ఆసీస్ ను భారత్ ఎలా కట్టడి చేస్తుందనేదే ఇప్పుడు అంతుచిక్కకుండా ఉంది.
ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఉన్నారు. వన్ డౌన్ లో పుజారా, ఆ తర్వాత రహానే, పంత్ తుదిజట్టులో ఆడే అవకాశం ఉంది. బుమ్రా, మయాంక్, అశ్విన్, జడేజా తదితరులు ఇప్పటికే తుది మ్యాచ్ లోకి దిగలేని పరిస్థితి నెలకొంది. హనుమ విహారి కూడా గాయపడ్డాడు. వీరి స్థానంలో పృథ్వీషా, కుల్ దీప్ యాదవ్ లను తుది జట్టులోకి తీసుకోవడంతో పాటు వాషింగ్టన్ సుందర్ ను అరంగేట్రం చేయించే అవకాశాలున్నాయి.
పేస్ బౌలింగ్ విషయానికి వస్తే టీం మొత్తం సిరాజ్ పైనే ఆశలు పెట్టుకుంది. అతనికి ఒకే మ్యాచ్ ఆడిన సైనీ తోడుగా ఉండగా.. ఇక, మూడో పేస్ బౌలర్ కావాలంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడని నటరాజన్ మాత్రమే ఆప్షన్ గా కనపడుతున్నాడు. మరి కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ కి తుదిజట్టులో ఎవరికి చోటు కల్పిస్తారో చూడాలి.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM