ఏపీలో ఘోరం..లిఫ్ట్ ఇచ్చి మహిళపై సామూహిక అత్యాచారం

by సూర్య | Wed, Jan 13, 2021, 01:41 PM

ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి బైక్‌ ఎక్కించుకున్న ఇద్దరు వ్యక్తులు కొద్దిసేపటికి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళ్తే బల్లిపర్రు నుంచి తెంపల్లికి ఓ మహిళ వెళ్తోంది. మార్గమధ్యలో బైక్‌పై ఇద్దరు వచ్చి లిఫ్ట్‌ ఇస్తామని ఆమెను ఎక్కించుకున్నారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత నిర్మాణుష్య ప్రాంతంలో ఆమెపై ఆ ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల కోసం ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM