by సూర్య | Wed, Jan 13, 2021, 09:24 AM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అంతకంతకే పెరిగిపోతున్నది. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా నగరంలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తున్నది. ఈ కాలుష్యానికి తోడు రోజు ఉదయాన్నే భారీగా మంచు కురుస్తుండటంతో ఢిల్లీ వాసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. దుమ్ము, ధూళితో మంచు కలిసిపోయి ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంటున్నది. దీంతో ఉదయం 10, 11 గంటల వరకు రోడ్లపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొన్నది. కనీసం 50 మీటర్ల దూరం కూడా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Latest News