by సూర్య | Tue, Jan 12, 2021, 04:17 PM
నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తీపికబురు చెప్పింది. త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని రైల్వే బోర్డు కొత్త సీఈవో సునీత్ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. అసిస్టెంట్ లోకో పైలట్లుగా ఎంపికైన వారు త్వరలో పిలుపును అందుకుంటారని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కారణంగా శిక్షణ ఇవ్వడంలో జాప్యం జరిగిందని..ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. డిసెంబర్ నుంచి రైల్వే బోర్డు పరిధిలోని అన్ని శిక్షణా కేంద్రాలలో శిక్షణ ప్రారంభమైందన్నారు. ఇదిలా ఉంటే గతేడాది లక్షా 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయగా..రెండు లక్షలకు మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కరోనా కారణంగా నిలిచిన పరీక్షలను డిసెంబర్ నుంచి నిర్వహిస్తున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందని సిఈవో సునీత్ శర్మ తెలిపారు.
Latest News