by సూర్య | Tue, Jan 12, 2021, 04:54 PM
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. క్రైస్తవులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా పార్టీకి చెందిన 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఒకేసారి పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు తమను బాధించాయని, క్రైస్తవ సమాజాన్ని చంద్రబాబు అవమానించారని వారు అన్నారు. బలవంతంగా మతమార్పుడులు చేస్తున్నట్లు నిరూపించాలని, చర్చి ఫాదర్ లకు రూ.5 వేలు ఇస్తే తప్పేముంది అని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ పేర్కొన్నారు. క్రైస్తవులపై ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో చంద్రబాబు చెప్పాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.
Latest News