by సూర్య | Tue, Jan 12, 2021, 12:33 PM
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. హోటల్ లో రిసెప్షనిస్టుపై బెదిరించి ఒకరు..పెళ్లి చేసుకుంటానని మరోకరు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన షబీర్ అహ్మద్, రిల్హాన్ సోదరులు బెంగళూరులో ఓ హోటల్ నడుపుతున్నారు. 2018లో వారి హోటల్లో రిసెప్షనిస్టుగా చేస్తున్న 19 ఏళ్ల యువతిపై షబ్బీర్ అహ్మద్ అత్యాచారానికి పాల్పడ్డారు. 2019లో కూడా మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం చెబితే ఉద్యోగం తీసేయ్యడంతోపాటు యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న రిల్హాన్ ఆమెను కలిసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేకాదు నిశ్చితార్థం చేసుకుందామని చెప్పి యువతి తల్లిదండ్రుల వద్ద 2 నెలల క్రితం రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. గతేడాది నవంబరు 20న పెళ్లికి ఫంక్షన్ హాల్ను మాట్లాడి..పెళ్లిపత్రికలు కూడా ముద్రించారు. ఈ సమయంలో దుబాయ్లో మంచి ఉద్యోగం ఉంది, పాస్పోర్ట్ కోసమంటూ ఖాళీ పేపర్లపై సంతకం చేయించుకుని మతం మారాలని బలవంతం చేశాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. అనంతరం వేరే యువతి మెడలో తాళి కట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత రిసెప్షనిస్ట్ షబీర్, రిల్హాన్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు షబీర్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.