by సూర్య | Tue, Jan 12, 2021, 12:23 PM
సెల్ఫీ(Selfie) పిచ్చిలో పడి యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు వింత వింత ప్రయోగాలతో ఫోటోలు తీసుకుంటూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. అటువంటి సెల్ఫీ సరదాకు ఓ యువతి నిండు ప్రాణం బలైంది. ఈ విషాదకర ఘటన ఒడిశా(Odisha)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఇయర్ సందర్భంగా మిత్రులతో కలిసి పిక్నిక్(Picnic )కు వెళ్లింది రాజ్గంగ్పూర్(Rajgangpur) సమీపంలోని కుంభర్పాడ(Kumbharpada)కు చెందిన 27 ఏళ్ల అనుపమ ప్రజాపతి (Anupama Prajapati) అనే యువతి. ఆ యువతి సుందర్గడ్ జిల్లాలోని ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్ కనకుండ్ వద్ద మిత్రులతో కలిసి నదీ(River) ఒడ్డున సెల్ఫీలు దిగుతుండగా.. కాలు జారి నదిలో పడిపోయింది. దీంతో, బలమైన ప్రవాహంతో వస్తున్న నదీ నీటిలో తక్షణమే కొట్టుకుపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు 22 గంటల సమయం పట్టింది.
ఆమె అదృశ్యమైన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలో గల రాళ్ల మధ్య మృతదేహం కనుగొనబడిందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో దేశంలో సెల్ఫీ మరణాలు పెరుగుతున్నాయి. 2018లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2011 అక్టోబర్ నుండి 2017 నవంబర్ వరకు దాదాపు 259 మరణాలు జరగ్గా.. వాటిలో అత్యధిక మరణాలు భారతదేశంలోనే జరిగాయని తేలింది.
Latest News