by సూర్య | Tue, Jan 12, 2021, 11:46 AM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడి టెస్ట్ కి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే గాయాల కారణంగా స్టార్ పేస్బౌలర్లు షమి, ఉమేష్ యాదవ్, ఆల్రౌండర్ జడేజా, సిడ్నీ టెస్ట్ హీరో హనుమ విహారి కూడా ఇప్పటికే గాయాల కారణంగా నాలుగో టెస్ట్ కి దూరమయ్యారు. తాజాగా జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బుమ్రా నాలుగో టెస్ట్ కి దూరమైనట్లేనని తెలుస్తుంది. ఇకపోతే ఆసీస్ తో టెస్ట్ మ్యాచ్ లో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఒక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే నాలుగో టెస్ట్ పై ఇరు జట్లు కన్నేశాయి. ఇంతలో భారత్ బౌలర్ బూమ్రా నాలుగో టెస్ట్ కి అందుబాటులోకి లేకపోవడం పెద్ద దెబ్బేనని చెప్పాలి.
Latest News