ప్రైవసీ పాలసీ నిబంధనలపై వెనక్కితగ్గిన వాట్సాప్..!

by సూర్య | Tue, Jan 12, 2021, 11:57 AM

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇటీవల మార్పు చేర్పులతో తీసుకుని వచ్చిన ప్రైవసీ నిబంధనలపై ఓ మెట్టుదిగింది. ప్రైవసీ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు తలెత్తడంతో యాజమాన్యం ఓ మెట్టు దిగింది. ప్రస్తుతం ఫేస్ బుక్ అధీనంలో ఉన్న వాట్సాప్ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. అన్ని ప్రైవేటు మెసేజ్ లూ 100 శాతం సురక్షితంగా ఉంటాయని..ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మెుద్దని కోరింది. బిజినెస్ ఖాతాలకు సంబంధించిన సమాచారంపైనే పాలసీ నిబంధనల ప్రభావం ఉంటుందని ట్విట్టర్ వేదికగా తెలిపింది.
బంధుమిత్రులు, స్నేహితులకు పంపే సమాచారం పూర్తి రహస్యంగా ఉంటుందని తెలిపింది. వాట్సాప్ ద్వారా బట్వాడా అయ్యే సమాచారాన్ని ఫేస్ బుక్ తో కూడా పంచుకోబోమని తేల్చి చెప్పింది. ఎవరి ప్రైవేటు మెసేజ్ లను తాము చూడబోమని, కాల్స్ ను కూడా వినబోమని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే కాల్ లాగ్స్ ను మాత్రం దాచి వుంచుతామని వెల్లడించింది. ఇక తమ మాధ్యమం ద్వారా లోకేషన్ షేర్ చేసినా ఆ వివరాలను చూడబోమని తెలిపింది. అలాగే ఫేస్ బుక్ కు ఇవ్వబోమని తెలిపింది.
కాంటాక్టుల వివరాలను కూడా ఎవరితోనూ పంచుకునేది లేదని హామీ ఇచ్చింది. ఇకపోతే ఫేస్ బుక్ యాజమాన్యంలో ఉన్నా..వాట్సాప్ గ్రూప్ ప్రైవేటు సంస్థగానే వ్యవహరిస్తుందని తెలిపారు. యూజర్లు అవసరమనుకుంటే తమ మెసేజ్ లను నియమిత సమయం తరువాత డిలీట్ చేసే ఆప్షన్ పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను తిరిగి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తామని వాట్సాప్ తెలిపింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM