రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై సుప్రీంకోర్టుకు కేంద్రం

by సూర్య | Tue, Jan 12, 2021, 09:00 AM

 గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రైతు సంఘాలు నిర్వహించదలచిన ట్రాక్టర్ల కవాతును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. ఢిల్లీ పోలీసు విభాగం ద్వారా పిటిషన్ దాఖలు చేయించింది. గణతంత్ర వేడుకలకు విఘాతం కలిగించేందుకు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు ట్రాక్టర్ల కవాతును నిర్వహించాలని కొన్ని వర్గాలు భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ చర్య యావత్తు దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుంది వివరించింది. ఏటా గణతంత్ర దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం రాజ్యాంగపరమైన, చారిత్రకపరమైన ఆవశ్యకతను కలిగి ఉందని తెలిపింది. 26వ తేదీకి మూడు రోజుల ముందు నుంచే రిహార్సల్స్‌ జరుగుతాయి. కనుక దేశ రాజధాని ప్రాంతంలో ఏ రూపంలోనూ నిరసనలు, ధర్నాలు, కవాతులు నిర్వహించకుండా నిలువరించాలి అని దిల్లీ పోలీసు విభాగం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM