మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ జిల్లాలో దారుణం

by సూర్య | Mon, Jan 11, 2021, 03:05 PM

మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ జిల్లాలో దారుణం జ‌రిగింది. 13 ఏండ్ల బాలిక‌పై ఐదుగురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాలిక ఇంటి ప‌క్క‌న బిల్డింగ్‌లోనే ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అత్యాచారానికి పాల్ప‌డిన ఐదుగురు యువ‌కుల‌తోపాటు వాళ్ల‌కు స‌హ‌క‌రించిన ఓ మ‌హిళ‌ను, మైన‌ర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.


వివ‌రాల్లోకి వెళ్తే.. నాసిక్ జిల్లాలోని నాసిక్ రోడ్ ఏరియాలో 13 ఏండ్ల బాలిక తన త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటున్న‌ది. ఎప్ప‌టిలాగే శ‌నివారం కూడా బాలిక త‌ల్లిదండ్రులు ప‌నుల‌కు వెళ్ల‌డంతో బాలిక ఒంట‌రిగా ఇంట్లో ఉన్న‌ది. అయితే, వారి ఇంటి ప‌క్క‌న బిల్డింగులో ఉండే యువ‌కుల క‌న్ను ఆ బాలిక‌పై ప‌డింది. దాంతో స‌ద‌రు యువ‌కులు ఓ మ‌హిళ‌, మ‌రో మైన‌ర్ బాలుడి సాయంతో ఆ బాలిక‌ను బిల్డింగ్‌పైకి ర‌ప్పించుకుని సామూహిక అత్యాచారం చేశారు.


 


ప‌నుల వ‌చ్చిన త‌ల్లిదండ్రులు ఇంట్లో బాలిక క‌నిపించ‌క‌పోవ‌డంతో చుట్టుప‌క్క‌ల వెతికారు. ఇంత‌లో ప‌క్క బిల్డింగ్‌పై నుంచి బాలిక ఏడుపు వినిపించ‌గా కిందికి తీసుకొచ్చారు. ఏం జ‌రిగింద‌ని త‌ల్లిదండ్ర‌లు ఆరా తీయడంతో బాలిక జ‌రిగిందంతా చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 19 నుంచి 29 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న ఐదుగురు నిందితులతోపాటు వారికి స‌హ‌క‌రించిన మైన‌ర్ బాలుడు, మ‌హిళ‌ను అర‌స్ట్ చేశారు.


 


 

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM