by సూర్య | Mon, Jan 11, 2021, 02:40 PM
‘జగనన్న అమ్మ ఒడి’ రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అమ్మఒడి పథకం విద్యార్దులకు శ్రీరామరక్ష అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు.
ప్రతి ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీషు బోధన.
ఫిబ్రవరి 1 నుంచి అంగన్వాడీ కేంద్రాల మార్పు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ల నిర్వహణ. వైఎస్సార్ పీపీ 1, పీపీ 2, ఫస్టు క్లాస్ నిర్వహణ.
9 నుంచి 12వ తరగతి విద్యార్దులు అమ్మఒడి పథకం నగదు వద్దనుకుంటే వారికి ల్యాప్ ట్యాప్. రూ.25 వేల ల్యాప్ ట్యాప్ ను రూ.18,500 కు ఇవ్వనున్నారు. ల్యాప్ ట్యాప్ కు 3 ఏళ్ల గ్యారంటీ,వారంటీ. ల్యాప్ ట్యాప్ లు పాడైతే వాటిని వారం రోజుల్లో రీప్లేస్ చేసి కొత్తది అందజేత.
వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్.