by సూర్య | Mon, Jan 11, 2021, 01:22 PM
ఏపీలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోవడానికి విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సెలవుల తరువాత పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించడానికి అనుమతులు కోసం సీఎం వద్ద విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. ప్రస్తుతానికి 9 నుంచి ఆ పై తరగతులకు విద్యార్థులకు మాత్రమే స్కూల్స్, కాలేజ్ లు ప్రారంభించాలని భావిస్తున్నారు. సీఎం జగన్ సోమవారం జరిగే కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి సెలవులు తరువాత ఈ నెల 18 నుంచి ఏపీలో పూర్తి స్థాయిలో పాఠశాలలు, కాలేజ్ లు తెరుకోవాడానికి సీఎం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన మార్గాలను విద్యాశాఖ అధికారులతోపాటు జిల్లావారిగా కలెక్టర్లతో కూడా సీఎం చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.