by సూర్య | Mon, Jan 11, 2021, 01:06 PM
సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రా గా ముగిసింది. దీంతో ఇరు జట్లు 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1-1 తో సమంగా నిలిచాయి. భారత బ్యాట్స్ మెన్ లు విహారి(23*), అశ్విన్(39*) క్రీజులో పాతుకుపోయి.. ఆసీస్ బౌలర్లతో ఓ ఆట ఆడుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు 258 బంతులాడి 62 పరుగులు చేశారు. మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. అంతకముందు రిషబ్ పంత్(97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పుజారా 77 పరుగులు చేశాడు.
Latest News