by సూర్య | Mon, Jan 11, 2021, 12:16 PM
న్యూఢిల్లీ: దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. దేశ రాజధాని కూడా బర్డ్ ఫ్లూ విస్తరించింది. ఢిల్లీలో చనిపోయిన కాకులు, బాతులకు సంబంధించిన ఎనిమిది నమూనాలను భోపాల్లోని ల్యాబ్కు పంపించారు. అందులో బర్డ్ ఫ్లూ కారణంగానే అవన్నీ మరణించాయని తేలింది. దీంతో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య తొమ్మిదికి చేరింది. నిన్న సంజయ్ లేక్లో 17 బాతులు చనిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆప్రాంతంలో ఉన్న పార్కులను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) మూసివేసింది. కాగా, గత కొన్నిరోజులుగా డీడీఏ పార్కుల్లో 14 చనిపోయిన కాకులను గుర్తించామని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో హౌజ్ ఖాస్ పార్క్, ధ్వారకా సెక్టార్ 9 పార్క్, హస్తల్ పార్కులను శనివారం మూసివేశారు.
Latest News