by సూర్య | Mon, Jan 11, 2021, 12:12 PM
జనవరి 17 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాల్సిన పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో.. ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు పల్స్ పోలియా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. టీకా పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆరోగ్య సిబ్బంది పాల్గొంటారు. దీంతో వ్యాక్సినేషన్ కు సిబ్బంది కొరత ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రం చెప్పింది.
Latest News