by సూర్య | Sat, Jan 09, 2021, 04:47 PM
వైసీపీ పాలనలో మహిళలతో పాటు దేవుడికీ రక్షణ లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. హిందూమతాన్ని గౌరవించని జగన్కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు. క్రైస్తవ మతాన్ని ఆచరించే వైవీ సుబ్బారెడ్డిని తితిదే ఛైర్మన్గా నియమించడాన్ని తప్పుపట్టారు. దేవాలయాలు తొలగించడానికి, ధ్వంసం చేయడానికి తేడా తెలియని వారు వైకాపా నేతలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడు కొండలను రెండు కొండలుగా చేస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను.. చంద్రబాబు ఇచ్చారని అంబటి రాంబాబు అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.
Latest News