by సూర్య | Sat, Jan 09, 2021, 05:22 PM
మతసామరస్యం కాపాడటానికి ప్రభుత్వం జారీ చేసిన జీవోలో రాజకీయ అంశాలను ప్రస్తావించడం సిగ్గుచేటని.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు దుయ్యబట్టారు. ఇవి ముమ్మాటికీ రాజకీయ వేధింపులు కోసం తీసుకొచ్చిన ఉత్తర్వులేనని ఆరోపించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు.. రాష్ట్రాన్ని 'అన్ జస్ట్, అన్ ఫెయిర్'గా విభజిస్తూ తీర్మానంచేసి, ఆ ప్రతిపాదనను కేంద్రానికి పంపగలరా అని నిలదీశారు. ఆర్థిక అంశాలనూ జీవోలో ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు. మండిపడ్డారు. చంద్రబాబుతో పోల్చితే అప్పులు చేయడంలో మాత్రమే జగన్ ముందున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News