తమిళనాడులో దారుణం..

by సూర్య | Sat, Jan 09, 2021, 03:50 PM

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై ఆమె కజిన్ అత్యాచారయత్నం చేయబోయాడు. దీంతో అతడి నుంచి ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆత్మరక్షణకోసం కత్తితో అతడిపై దాడి చేసి హతమార్చింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వెల్లడించింది. తమిళనాడులో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే తిరువల్లూర్‌ జిల్లాలోని శోలవరం ప్రాంతానికి చెందిన పందొమిదేళ్ల యువతిని ఆమె కజిన్‌(24) గత కొన్నిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. అక్కడ మాటువేసిన మృగాడు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నిందితుడు తెచ్చుకున్న కత్తి కిందపడటంతో దాన్ని తీసుకున్న ఆమె అతడిపై దాడికి దిగింది. దీంతో అతడు మరణించాడు.
అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు ఆమెను అభినందించారు. ఆమె చాలా ధైర్యవంతురాలు. నిజాయితీపరురాలు కూడా. వాంగ్మూలం ఇచ్చేటపుడు ఏమాత్రం భయపడలేదు. నిజానికి తను ఫోన్‌ చేయగానే మావాళ్లు షాకయ్యారు. మృతుడు ప్రవర్తనతో విసుగెత్తిన ఆమె కుటుంబ సభ్యులు గతంలోనే అతడిని హెచ్చరించారు. అయినా తన తీరు మార్చుకోలేదు. సెక్షన్‌ 100 కింద కేసు నమోదు చేశాం. ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య కాబట్టి ఆమెకు కొన్ని మినహాయింపులు లభిస్తాయి అని పోలీసులు తెలిపారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM