సీఎం అభ్య‌ర్థిగా ప‌ళ‌నిస్వామి పేరు ఖ‌రారు

by సూర్య | Sat, Jan 09, 2021, 01:59 PM

చెన్నై: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అక్క‌డి రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. అధికార ప్ర‌తిప‌క్షాలు స‌భ‌లు, సమావేశాలు ఏర్పాటుచేసి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను ర‌చిస్తున్నాయి. తాజాగా త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో ఏఐఏడీఎంకే జ‌న‌ర‌ల్ కౌన్సిల్ స‌మావేశ‌మై సీఎం, డిప్యూటీ సీఎం అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి పేరును, డిప్యూటీ సీఎంగా ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎం ఓ ప‌న్నీర్ సెల్వం పేరును ఖ‌రారు చేసింది.


అసెంబ్లీ ఎన్నిక‌ల బరిలో నిలిచే అభ్య‌ర్థుల ఎంపిక‌, ఇత‌ర పార్టీల‌తో పొత్తులు, సీట్ల పంప‌కం త‌దిత‌ర అన్ని విష‌యాల్లో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి, పార్టీ కోఆర్డినేట‌ర్‌ ప‌న్నీర్ సెల్వం నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఏఐఏడీఎంకే జ‌న‌ర‌ల్ కౌన్సిల్ తీర్మానించింది. కాగా, ఏఐఏడీఎంకే జ‌న‌ర‌ల్ కౌన్సిల్ స‌మావేశం నేప‌థ్యంలో కోయంబేడు-మ‌దుర‌వోయ‌ల్ ర‌హ‌దారిలోని పార్టీ కార్యాల‌యం వ‌ద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.    

Latest News

 
నేడు కమలాపురం నియోజకవర్గంలో వైయస్ షర్మిల ప్రచారం Tue, May 07, 2024, 10:27 AM
వరదయ్యపాళెంలో గడ్డివామి దగ్ధం Tue, May 07, 2024, 10:19 AM
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM