by సూర్య | Sat, Jan 09, 2021, 01:49 PM
నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెర్లోపల్లిలో సరదాగా ఊయల ఊగుతుండగా ఆ తాడు చిన్నారి మెడకు చుట్టుకోవడంతో ఏడేళ్ల బాలిక చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే చెర్లోపల్లి గ్రామానికి చెందిన సజ్జనపు రవీంద్ర, సత్యవతి ల రెండో కుమార్తె మోషిక. ఏడేళ్ల మోషిక ఇంట్లో చీరలో కట్టిన ఊయల ఊగుతుంది. అయితే ఉన్నట్లుండి ఊయల తాడు మెడకి చుట్టుకొని పోయి ఉరిగా మారింది. దీంతో ఊపిరి అందకపోవడంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Latest News