జార్ఖండ్‌లో దారుణం..50 ఏళ్ల వితంతువుపై అత్యాచారం

by సూర్య | Sat, Jan 09, 2021, 01:12 PM

దేశంలో ఆడవారిపై దారుణాలు ఆగడం లేదు. యూపీలోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల మహిళపై పూజారి, అతని శిష్యులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే... అదే తరహాలో జార్ఖండ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. చత్రా జిల్లాలోని కోబ్నా గ్రామంలో 50 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హంటర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే కోబ్నా గ్రామానికి చెందిన ఓ వితంతువు ఒంటరిగా జీవిస్తోంది. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆమెపై కన్నేశారు. ఈనెల 7న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా ముగ్గురు చొరబడ్డారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. బాధితురాలి జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి నరకం చూపించారు. దీంతో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం ఆమెను అక్కడ వదిలేసి వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమెను హంటర్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ డా.వెంకట్ ప్రకాశ్ తెలిపారు. ఇకపోతే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముుగ్గురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా..అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Latest News

 
పెనగలూరు మండలంలో టీడీపీ లోకి భారీగా చేరికలు Tue, May 07, 2024, 05:16 PM
పీపుల్స్ మ్యాని ఫెస్టో బుక్ లెట్ ను ఆవిష్కరించిన జెవివి Tue, May 07, 2024, 05:15 PM
చిట్వేలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ నాయకులు Tue, May 07, 2024, 05:13 PM
మరొకసారి వైసిపి ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Tue, May 07, 2024, 05:12 PM
నిత్యం ప్రజల కోసమే పని చేస్తా- ఉగ్ర నరసింహ రెడ్డి Tue, May 07, 2024, 05:09 PM