by సూర్య | Sat, Jan 09, 2021, 01:07 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఈడీ కోర్టు షాక్ ఇచ్చింది. కేసు విచారణలో భాగంగా సమన్లు జారీ చేసింది. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశించింది. నాంపల్లి కోర్టు నుంచి అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ను ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. దీంతో అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు, విజయసాయి రెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
Latest News