by సూర్య | Sat, Jan 09, 2021, 11:10 AM
ఆస్ట్రేలియా తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 244పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ కంటే 94 పరుగులు వెనుక బడింది. 99/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ 244పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాట్స్ మన్ లో ఛటేశ్వర పుజారా 50 పరుగులు చేశాడు. చివర్లో రిషభ్ పంత్, జడేజాలు కొంచం ధాటిగా ఆడటంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లతో రాణించాడు.
Latest News