ముంబై అగ్నిప్ర‌మాదం..

by సూర్య | Sat, Jan 09, 2021, 10:47 AM

మ‌హారాష్ర్ట భాంద‌రా జిల్లా ఆస్ప‌త్రిలో శ‌నివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన విష‌యం విదిత‌మే. సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్‌(ఎస్ఎన్‌యూసీ)లో మంట‌లు చెల‌రేగ‌డంతో 10 మంది న‌వ‌జాత శిశువులు మృతి చెందారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఆ యూనిట్‌లో 17 మంది శిశువులు ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. మిగ‌తా ఏడుగురిని అధికారులు సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. 


10 మంది న‌వ‌జాత శిశువులు మృతి చెంద‌డం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని మోదీ ట్వీట్ చేశారు. అగ్నిప్ర‌మాదంలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అమిత్ షా పేర్కొన్నారు. ప‌సి పిల్ల‌ల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉండాల‌ని రాహుల్ విజ్ఞ‌ప్తి చేశారు. 


 


 

Latest News

 
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు Fri, May 17, 2024, 09:17 PM
విశాఖ వందేభారత్ ఐదు గంటలు ఆలస్యం.. ఈ రైళ్లు బయల్దేరే సమయం మారింది Fri, May 17, 2024, 09:13 PM
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..ఈ రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు Fri, May 17, 2024, 09:09 PM
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ Fri, May 17, 2024, 09:05 PM
రాడ్ తీయించుకునేందుకని ఆస్పత్రికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు Fri, May 17, 2024, 09:01 PM