by సూర్య | Fri, Jan 08, 2021, 01:47 PM
వాహనదారులకు ఊరట కలిగించాలని భావిస్తున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. ఇప్పటికే ప్రభుత్వానికి ధరల తగ్గింపు ప్రతిపాదన చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. కరోనా వ్యాప్తి సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకు పెంచింది. ఇప్పుడు అందులో 50 శాతం తగ్గింపునిచ్చినా.. ధరలు లీటరుకు రూ.5 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా రేట్లు తగ్గిస్తే.. అప్పుడు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు నిలకడగానే కొనసాగాయి. హైదరాబాద్ లో శుక్రవారం పెట్రోల్ ధర రూ.87.59, డీజిల్ ధర రూ.81.17 వద్ద నిలకడగా ఉన్నాయి.