by సూర్య | Fri, Jan 08, 2021, 01:44 PM
ఆలయాల దాడుల అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ థాస్తో పాటు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దాడులకు సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు. కృష్ణా, రాజమండ్రిలో జరిగిన ఘటనలు ఒకే ఎలక్ట్రిక్ రంపం వినియోగించినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. మతమార్పిడి ఘటనలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని శాంతిభద్రత ఏడీజీ అన్నారు. సీఎం, డీజీపీ, హోంమంత్రిలు క్రైస్తవుల కంటే ముందు ప్రజా సేవకులన్నారు. వారికి ఎలాంటి వాటిని ఆపాదించటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
Latest News