by సూర్య | Fri, Jan 08, 2021, 12:33 PM
యూపీలోని షాజహాన్ పూర్ లో దారుణ ఘటన జరిగింది. హర్షవర్ధన్ అనే ఓ 21 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు రైలు కింద పడ్డాడు. దీంతో అతడి శరీరం రెండు భాగాలుగా తెగిపడింది. ఓ భాగం పట్టాల మీదే ఉండిపోతే.. పై భాగం ఎగిరి పక్కనే ఉన్న కాల్వలో పడింది. ఆ సగం భాగంతోనే అతడు అక్కడ గుమిగూడిన జనంతో మాట్లాడాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలని రైలు కింద పడితే అలా అయ్యిందని, తనని ఎవరూ ఏం చేయలేదని బిగ్గరగా అరిచాడు. శరీరం రెండుగా తెగిపడినా అతడు 12 గంటలకు పైగా బ్రతికాడు. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన చాలా మందిని కంటతడి పెట్టించింది.
Latest News