నిద్రపోతున్న భర్తపై మొహంపై వేడి నూనె..

by సూర్య | Thu, Jan 07, 2021, 02:09 PM

భర్త రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. తెల్లవారుజామున నిద్రపోతున్న భర్తపై వేడి నూనె పోసేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. సాగర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అరవింద్ అహివార్‌కు శివకుమారి అనే మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. కూలి పని చేసే అరవింద్ కొద్దిరోజులుగా నిత్యం ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడు.


రోజూ ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని భార్య అడిగితే ఏవో కారణాలు చెప్పేవాడు. అయితే భర్తపై అనుమానం పెంచుకున్న శివకుమారి రోజూ అతడితో గొడవలు పడేది. భార్యభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో పెద్దలు సర్దిజెప్పారు. అయినప్పటికీ అరవింద్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శివకుమారి భర్తపై కక్ష పెంచుకుంది. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో నిద్రమత్తులో ఉన్న అరవింద్‌ మొహంపై మరిగే నూనె పోసేసింది.


 


అతడి కేకలు విన్న కుటుంసభ్యులు, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి మొహంపై చర్మం బాగా కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే భర్తపై నూనె పోశానన్న పశ్చాత్తాపం కూడా లేకుండా శివకుమారి ఇంట్లోనే ఉండటం, ఈ ఘటన స్థానికులకు అందరికీ వివరించడం కుటుంబసభ్యులను షాక్‌కు గురిచేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శివకుమారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
రోడ్డుపై ఆపాడని కానిస్టేబుల్‌ను కొట్టిన యువకుడు.. వీడియో వైరల్ Sun, May 19, 2024, 04:37 PM
ఏపీవాసులకు అలర్ట్.. ఆ జిల్లాలలో భారీ వర్షాలు Sun, May 19, 2024, 04:32 PM
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. 4 రోజుల్లోనే అకౌంట్లలో పడిన రూ.5868 కోట్లు Sun, May 19, 2024, 04:30 PM
మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు Sun, May 19, 2024, 04:27 PM
నాగబాబు ట్వీట్‌కు పోతిన మహేష్ కౌంటర్ ట్వీట్.. స్నేక్ బాబు, పుష్ప అంటూ ఫైర్ Sun, May 19, 2024, 03:52 PM