by సూర్య | Thu, Jan 07, 2021, 02:19 PM
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొంతసేపు వర్షం వల్ల ఆట నిలిచిపోయింది. వార్నర్ (5) విఫలమైనా, మరో ఓపెనర్ పకోస్కీ(62) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్(67*), స్టీవ్స్మిత్(31*) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. సిరాజ్, సైని లకు చెరో వికెట్ దక్కింది.
Latest News