by సూర్య | Thu, Jan 07, 2021, 01:29 PM
అండమాన్ నికోబార్ దీవుల్లోని కాంప్బెల్ తీరంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ లోని దిగ్లీపూర్ గురువారం ఉదయం 6.57 గంటలకు భూమి కంపించిందని అండమాన్ నికోబార్ అధికారులు చెప్పారు. ఈ భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పలుసార్లు భూమి కంపించింది. గత ఏడాది జూన్ 10వతేదీన అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. గత ఏడాది మే 22వతేదీన కూడా అండమాన్లో భూమి కంపించింది.
Latest News