by సూర్య | Thu, Jan 07, 2021, 01:33 PM
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, తెదేపా సీనియర్ నేత పురంశెట్టి అంకుల్ హత్యను ఆపార్టీ నేత యరపతినేని శ్రీనివాస రావు ఖండించారు. రాష్ట్రంలో తెదేపా నేతలు, కార్యకర్తల హత్యలు పెరిగిపోతున్నాయని.. ఇవి సర్కారీ హత్యలేనని ఆరోపించారు.టీడీపీ పల్నాడులో పుంజుకుంటున్న క్రమంలో వైకాపా ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుందని అన్నారు. నరహంతకుల్లా మారి.. తెదేపా నాయకులను, కార్యకర్తలను చంపుకుంటూ వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Latest News