పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య..

by సూర్య | Thu, Jan 07, 2021, 12:56 PM

ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని నాశనం చేశాయి. అప్పుల బాధ తట్టుకోలేకపోయిన భార్యభర్తలు ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి అనంతరం ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లా హొసపేటె తాలూకా గాదిగనూరులో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గాదిగనూరులో నివాసం ఉండే నంజుండేశ్వర(32) సమీపంలోని జిందాల్‌ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నాడు. వచ్చే జీతం కుటుంబ పోషణకు చాలకపోవడంతో దొరికిన చోటల్లా అప్పులు చేశాడు.
అప్పులు తీర్చే మార్గం కనిపించక, రుణదాతలు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యనుకున్నాడు. మంగళవారం రాత్రి తన ఇద్దరు బిడ్డలు గౌతమి (3), స్వరూప్‌ (2)కు పురుగులమందు తాగించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక భార్య పార్వతి(27)తో కలిసి ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాదిగనూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బుధవారం నంజుండ- పార్వతి ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. ఈలోగానే వారు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త తెలిసి బంధువులు, సన్నిహితులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM
ఊరవతల మామిడితోటలోని గదిపై అనుమానం.. వెళ్లి తలుపులు తెరిస్తే.. పోలీసులే షాక్ Sun, Apr 28, 2024, 08:47 PM
పిఠాపురం: నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..? వైసీపీ గూటికి వర్మ Sun, Apr 28, 2024, 08:03 PM