by సూర్య | Thu, Jan 07, 2021, 12:52 PM
అమెరికా క్యాపిటల్ భవనంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాషింగ్టన్ డీసీ పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ బుధవారం (అక్కడి కాలమానం ప్రకారం) సమావేశమైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు ‘క్యాపిటల్ భవనం’లోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Latest News